న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఎలక్ట్రానిక్స్ పరికరాల దిగ్గజం సామ్సంగ్కు చెందిన అత్యంత విలువైన 5జీ స్మార్ట్ఫోన్ సిరీస్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్4 ముందస్తు బుకింగ్లు ఆరంభించింది. ఈ స్మార్ట్ఫోన్ ధర రూ.1.85 లక్షలు. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడంతో ఈ ఫోన్ ధర భారీగా పెరిగింది.
12 జీబీ ర్యామ్, 256 జీబీ మెమొరీ కలిగిన స్మార్ట్ఫోన్ ధర రూ.1,54,999గాను, 12జీబీ, 512 జీబీ మెమొరీ ధర రూ.1,64,999, అలాగే టాప్-ఎండ్ మోడల్ 12జీబీ, 1 టీబీ స్టోరేజ్ కలిగిన మోడల్ రూ.1,84,999గా నిర్ణయించింది. గెలాక్సీ జెడ్ఫోల్డ్ 4ని కొనుగోలు చేసిన వారికి రూ.34,999 విలువైన గెలాక్సీ వాచ్4 క్లాసిక్ స్మార్ట్వాచ్ను రూ.2,999కి అందిస్తున్నది.