Reliance | అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ హెచ్చరించింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ముడి చమురు రిఫైనింగ్ ఫ్యాక్టరీ గల రిలయన్స్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2022-23 ఏప్రిల్-జూన్) అంచనాల కంటే తక్కువ లాభాలు మాత్రమే పొందింది. మున్ముందు మరింత భారాలను భరించాల్సి ఉంటుందని పేర్కొంది.
కనిష్ట ధరలతోపాటు లాభాలు తగ్గుముఖం పట్టడంతో ఆయిల్ మార్కెట్ ఫండమెంటల్స్ను ఆర్థిక మాంద్యం భయాలు అధిగమిస్తాయని శుక్రవారం తొలి త్రైమాసికం ఆర్థిక ఫలితాల వెల్లడి తర్వాత రిలయన్స్ జాయింట్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ వీ శ్రీకాంత్ చెప్పారు.
ఇన్పుట్ ధరలు, రవాణా చార్జీలు పెరిగిపోవడంతో నిర్వహణ ఖర్చులు అధికం కావడం పట్ల రిలయన్స్ జాయింట్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ వీ శ్రీకాంత్ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, ఈ నెలాఖరులోగా ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు ఔట్లుక్ను తగ్గించనున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకటించింది.