హైదరాబాద్, ఆగస్టు 31: ప్రైవేట్ బ్యాంకింగ్ సేవల సంస్థ కరూర్ వైశ్యా బ్యాంక్ విస్తరణ బాట పట్టింది. దేశవ్యాప్తంగా ఒకేసారి 16 నూతన శాఖలను ప్రారంభించడంతో మొత్తం సంఖ్య 919కి చేరుకున్నట్టు బ్యాంక్ ఎండీ, సీఈవో రమేశ్ బాబు తెలిపారు.
వీటిలో తమిళనాడులో ఆరు, ఆంధ్రప్రదేశ్లో ఐదు, తెలంగాణలో మూడు..కర్ణాటక, ఢిల్లీ ఎన్సీఆర్ల్లో ఒక్కో శాఖను తెరిచింది. తెలంగాణలో సోమవారం ఒకేరోజు మూడు శాఖలను ప్రారంభించడం తో మొత్తం శాఖలు 68కి చేరుకున్నాయి.