న్యూఢిల్లీ, ఆగస్టు 30: బంగారం ధరలు మరింత పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడానికితోడు దేశీయంగా పండుగ సీజన్ కావడంతో ధరలు పెరుగుతున్నాయి. బుధవారం తులం బంగారం ధర రూ.60 వేలు దాటింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల ధర రూ.300 అధికమై రూ.60,100 పలికింది. గత ముగింపు రూ.59,800గా ఉన్నది. పసిడితోపాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.400 అధికమై రూ.77,500కి చేరుకున్నది. పెట్టుబడిదారులు వేచి చూసే దోరణి పాటిస్తున్నారని, దేశ జీడీపీ క్యూ2 గణాంకాలు విడుదల కానుండటంతో వీటిపై ప్రధానంగా దృష్టి సారించారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,936 డాలర్ల వద్ద, వెండి 24.60 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.