న్యూఢిల్లీ, నవంబర్ 25: విద్యుత్తు వాహనాల తయారీ స్టార్టప్ ప్రవైగ్ డైనమిక్స్.. దేశీయ మార్కెట్కు స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని పరిచయం చేసింది. ‘డెఫీ’ పేరుతో విడుదల చేసిన ఈ ఎస్యూవీ ధరను రూ.39.5 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఆడీ ఈ-ట్రాన్, మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూసీ మోడళ్ళకు పోటీగా సంస్థ ఈ నయా మోడల్ను ఆవిష్కరించింది. ఈ నయా మోడల్ కోసం ముందస్తు బుకింగ్లు ఇప్పటికే ఆరంభించింది. బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి అందచేయనున్నట్లు ప్రవైగ్ చీఫ్ స్ట్రాటజీ అధికారి రామ్ దివేది తెలిపారు. బ్యాటరీ రీచార్జితో 500 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కారు 402 బీహెచ్పీల శక్తినివ్వనున్నదన్నారు.