Power Crisis | విద్యుత్ కొరత నివారణకు కేంద్రం అనుసరించిన వ్యూహం ఫలించినట్లే కనిపిస్తున్నది. పవర్ ప్లాంట్లకు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన అదనపు బొగ్గు నిల్వలను సరఫరా చేశారు. దీంతో పలు పవర్ ప్లాంట్ల యూనిట్లు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు.
మూడు రోజుల క్రితం వరకు అక్టోబర్ 13 వరకు వివిధ పవర్ప్లాంట్ల వద్ద నాలుగు రోజులు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ నెల 12న అందుబాటులోకి వచ్చిన గణాంకాల మేరకు 142 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల పవర్ ప్లాంట్లు 137 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి స్థాయికి చేరుకున్నాయి.
పరిస్థితులు చక్కబడటంతో పలు రాష్ట్రప్రభుత్వాలు విద్యుత్ సరఫరాపై పరిమితులు తొలగించివేశాయి. మరోవైపు నాన్ పవర్ యుటిలిటీస్ బొగ్గు సరఫరాపై నిషేధాజ్ఞలను తొలగిస్తామని కోల్ ఇండియా, సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ ఉపసంహరించుకోనున్నాయి. అంతకుముందు దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు నాన్ పవర్ యుటిలిటీస్కు బొగ్గు సరఫరా నిలిపేయాలని కోల్ ఇండియా నిలిపివేసింది.
నవరాత్రి, దుర్గా పూజల నేపథ్యంలో పవర్ ప్లాంట్లకు సరిపడా బొగ్గు నిల్వలు చేరతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పంజాబ్ అధికారి ఒకరు విద్యుత్ సంక్షోభం తగ్గినట్లేనని సంకేతాలిచ్చారు. యూపీలో విద్యుత్ కోతలు విధించినట్లు వార్తల్లేవు.
రాజస్థాన్ విద్యుత్ ప్రసారణ్ నిగం చైర్మన్ భాస్కర్ సావంత్ కూడా పరిస్థితి మెరుగుపడిందన్నారు. ఇక గతవారం ఒక యూనిట్ విద్యుత్ను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రూ.14లకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అది రూ.9.67లకు దిగివచ్చిందని ఇండియన్ ఎలక్ట్రిసిటీ ఎక్స్చేంజ్ గణాంకాలు చెబుతున్నాయి.