ముంబై ,జూన్ 5: యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వినియోగదార్లకు అందిస్తున్న క్యాష్ బ్యాక్ ఆఫర్ను పేటీఎం పొడిగించింది. పేటీఎం వినియోగదారులు జూన్ 30 వరకు తాము బుక్ చేసుకున్న ఎల్పీజీ సిలిండర్లపై క్యాష్ బ్యాక్ పొందవచ్చని తెలిపింది. ఈ ఆఫర్తో వినియోగదారులు రూ. 800 వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశాన్ని కల్పిస్తున్నది పేటీఎం. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో గ్యాస్ ధరలు రూ. 800 నుంచి 850 మధ్యలో ఉండగా ఈ క్యాష్ బ్యాక్తో వినియోగదారులు తమ సిలిండర్ను ఉచితంగా పొందినట్లు అవుతుంది.
తొలుత ఈ ఆఫర్ను మే 31 వరకే అని ప్రకటించిన పేటీఎం.. దాన్ని జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ అఫర్ ను పొందాలనుకునే వినియోగదారులు ముందుగా తమ ఫోన్లో పేటీఎం యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ‘బుక్ గ్యాస్ సిలిండర్’ సెక్షన్కి వెళ్లి తమ డీలర్ షిప్ను ఎంచుకోవాలి. (భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్, ఇండేన్ లాంటివి). అనంతరం గ్యాస్ ప్రొవైడర్ వివరాలు, కన్జూమర్ నంబర్, మొబైల్ నంబర్ లేదా ఎల్పీజీ ఐడీ తదితర వివరాలు నమోదు చేసి బుకింగ్ ప్రక్రియ ప్రారంభించాలి.