Ola Electric | ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తాజాగా 200 మిలియన్ల డాలర్లకు పైగా నిధులు సేకరించింది. ఫాల్కన్ ఎడ్జ్తోపాటు సాఫ్ట్ బ్యాంక్ తదితర ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన పెట్టుబడుల మొత్తం 300 కోట్లకు చేరుకున్నదని క్యాబ్ అగ్రిగేటర్ ఓలా అనుబంధ ఓలా ఎలక్ట్రిక్ గురువారం వెల్లడించింది.
భారత్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించడమే లక్ష్యంగా మిషన్ ఎలక్ట్రిక్ను బలోపేతం చేయడానికి తాము నిధులు సమకూర్చుకుంటున్నట్లు తెలిపింది. 2025 తర్వాత ఇతర వెహికల్ ప్లాట్ఫామ్స్లో అభివృద్ధిపై కేంద్రీకరిస్తామని పేర్కొంది. ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్లు, మాస్ మార్కెట్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడంపై ఫోకస్ చేస్తామని వెల్లడించింది.
ఇప్పటికే ఓలాలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు ధన్యవాదాలు.. కొత్త ఇన్వెస్టర్లకు స్వాగతం పలుకుతున్నాం. సమీప భవిష్యత్లో 100 కోట్ల వాహనాలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అంటూ ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ తెలిపారు. ఆగస్టు 15న ఆవిష్కరించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎస్1, ఎస్ 1 ప్రో మోడళ్ల విక్రయింతో 150 మిలియన్ల డాలర్లు సంపాదించింది.