హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) డైరెక్టర్ (ఫైనాన్స్)గా విధులు నిర్వర్తిస్తున్న నూక శ్రీనివాసులుకు పదొన్నతి లభించింది. ఆయన కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు శనివారం స్వీకరించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో బ్యాచిలర్ ఇన్ కామర్స్, ఎంబీఏ ఫైనాన్స్ చేశారు. బీడీఎల్లో 27 ఏండ్లుగా ఆర్థిక, మానవ వనరుల విభాగంలో విధులు నిర్వహించారు.