దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి నిస్సాన్ ఇండియా మరో మాడల్ను తీసుకొచ్చింది. గ్రావిటీ పేరుతో విడుదల చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ.5.65 లక్షలు కాగా గరిష్ఠ ధర రూ.8.49 లక్షలు. ఏడుగురు కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ కారులో ఆరు ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్, 20 సెంటీమీటర్ల ఇన్ఫోటైన్మెంట్, వైర్లెస్ చార్జర్, ఆటో లెడ్ హెడ్ల్యాంప్ సౌకర్యాలున్నాయి.
లీటర్ పెట్రోల్కు 19.6 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వనున్నది.