న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ఇమీడియట్ పేమెంట్ సర్వీసెస్ (ఐఎంపీఎస్)ను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) సరళీకరించింది.
ఇప్పటివరకూ పెద్ద మొత్తంలో ఐఎంపీఎస్ ద్వారా నగదు పంపించాలంటే బెనిఫీషియరీని బ్యాంక్ ఖాతాకు యాడ్ చేసుకోవాల్సి వచ్చేది. ఇక నుంచి మొబైల్ నంబర్, బ్యాంక్ పేరు, నగదు స్వీకరించేవారి పేరు ఉపయోగించి రూ. 5లక్షల వరకు నగదు పంపవచ్చని ఎన్పీసీఐ తెలిపింది.