న్యూఢిల్లీ, జనవరి 26: అంతర్జాతీయ సంస్థలు ఒక్కొక్కటీ చైనా నుంచి తరలివెళుతున్నాయి. ఇప్పటికే పలు గ్లోబల్ కంపెనీలు తమ ప్లాంట్లను ఇతర దేశాలకు తరలిస్తుండగా..తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ చిప్ల తయారీ సంస్థ మైక్రాన్ కూడా చేరింది. షాంఘైలో తనకు ఉన్న చిప్ డిజైనింగ్ సెంటర్ను అమెరికా లేదా భారత్కు తరలించేయోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఏడాది చివరి నాటికి షాంఘైలో ఉన్న డ్రామ్ చిప్ డిజైనింగ్ సెంటర్ను మూసివేయనున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్ట్ చేసింది. దీనిపై మైక్రాన్ సంస్థ స్పందించడానికి నిరాకరించింది. 150 మంది చైనా ఇంజినీర్లు కలిగిన యూనిట్ రిలోకేట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మైక్రాన్ యూనిట్ తరలివెళ్లడం పలు అనుమానాలకు తావిస్తున్నది.