హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఎక్సెండెడ్ రియాల్టి టెక్నాలజీపై మెటా, మైటీ స్టార్టప్ హబ్తో కలిసి గ్రాండ్ చాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గచ్చిబౌలి ట్రిపుల్ -సీఐఈ స్టార్టప్ ఇంక్యుబేటర్ నిర్వాహకులు తెలిపారు. కొత్తగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల్లో ఒకటైన ఎక్సెండెడ్ రియాల్టిపై సరికొత్త ఆవిష్కరణలు చేసే స్టార్టప్లకు ఆర్థిక సహకారం రూ.50 వేల నుంచి రూ. 20 లక్షల వరకు అందించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మరిన్ని వివరాలకు https://cie.iiit.ac.in/xr-startup-programలో సంప్రదించాలని, ఆసక్తి ఉన్న వారు వచ్చే నెల 13లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.