ముంబై, సెప్టెంబర్ 30: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో విడుదల చేయబోతున్న ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వాహనమైన ఎక్స్యూవీ 700 బుకింగ్లను వచ్చే నెల 7 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. 5, 7 ప్రయాణికులు కూర్చోవడానికి వీలుండే ఈ మోడల్.. డీజిల్, గ్యాసోలిన్, మాన్యువల్, ఆటోమేటిక్ మోడళ్ళలో లభించనున్నది. అయినప్పటికీ ఈ మోడల్ను ఎప్పుడు విడుదల చేయనున్నదో మాత్రం సంస్థ వెల్లడించలేదు. రెండు రకాల్లో లభించనున్న ఈ కారు రూ.11.99 లక్షలు, రూ.13.99 లక్షలుగా ధరలను నిర్ణయించింది. ఈ ధరలు తొలి 25 వేల బుకింగ్లకు మాత్రమే వర్తించనున్నదని పేర్కొంది.