హైదరాబాద్, సెప్టెంబర్ 3 : ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా.. దేశీయ మార్కెట్లోకి బ్లేజో ఐ-టీఆర్కే ట్రక్కులను తీసుకొచ్చింది. అధిక మైలేజీ ఇచ్చే ఈ ట్రక్కులతో కొనుగోలు చేసిన నాటి నుంచి ఐదేండ్లలో రూ.15 లక్షల వరకు ఆదాకానున్నదని కంపెనీ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వినోద్ సహవే తెలిపారు.
7.2 లీటర్ల ఇంజిన్తో తయారైన ఈ 320 హెచ్పీ ఎంపవర్ మాడల్ పాత మాడళ్లతో పోలిస్తే అధిక మైలేజీ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి ఈ-బస్సును కూడా తీసుకురానున్నట్టు ప్రకటించారు.