హైదరాబాద్, జనవరి 6: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోస్ ఆలుక్కాస్ వార్షికోత్సవ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా ఆకర్షణీయమైన ధరల తగ్గింపుతోపాటు బహుమతులు, బంగారం, వజ్రాలు, ప్లాటినం, ఆభరణాలను తగ్గింపు ధరకే విక్రయిస్తున్నది. దీంట్లోభాగంగా రూ.50 వేలకు పైబడిన బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక బంగారు నాణేన్ని అందిస్తున్న సంస్థ..వజ్రాలపై 20 శాతం, ప్లాటినం ఆభరణాలపై 7 శాతం తగ్గింపు ధరకే విక్రయిస్తున్నట్లు తెలిపింది.
ఈ ప్రత్యేక ఆఫర్లు ఈ నెల 6 నుంచి హైదరాబాద్లో ఉన్న మూడు షోరూంలతోపాటు నిజామాబాద్, విజయవాడ, విశాఖపట్నం షోరూంలలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంచింది. ఈ సందర్భంగా జోస్ ఆలుక్కాస్ చైర్మన్ జోస్ ఆలుక్కా మాట్లాడుతూ..దక్షిణాదిలో తన వ్యాపార వృద్ధికి తెలంగాణ, ఏపీలు గణనీయమైన భాగస్వామ్యాన్ని అందించాయని, ఈ షోరూంలలో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంచినట్టు చెప్పారు.