Jio Fiber | హైదరాబాద్, జూలై 28: ఎడతెగని వర్షాలతో ఇళ్లకే పరిమితమైన వారికి నిరంతరాయంగా వినోదం, కనెక్టివిటీని అందించడానికి జియో ఫైబర్ సరికొత్త ఆఫర్ను పరిచయం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ బ్రాండ్బ్యాండ్ ప్రొవైడర్గా నిలిచిన జియో ఫైబర్ ప్రస్తుతం కేవలం నెలకు రూ.398తో సరికొత్త ప్లాన్ను ఆవిష్కరించింది. ఈ అద్భుతమైన ప్లాన్ అనేక ప్రయోజనాలు కలిగివుంటుందని తెలిపింది. దీంతోపాటు జియో ఫైబర్ ప్రత్యేకమైన మాన్సూన్ ఆఫర్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ఉచితంగా 4కే సెట్-టాప్ బాక్స్తోపాటు ఉచిత గిగా ఫైబర్ రూటర్ను పొందవచ్చును. వీటి మొత్తం విలువ రూ.10 వేలు. దీంతోపాటు జీరో ఇన్స్టాలేషన్, డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మాన్సూన్ ఆఫర్ను ఎంచుకునే కస్టమర్ ఆరు నెలల పాటు ముందస్తు రీచార్జిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్లపై మరిన్ని వివరాలకు జియో స్టోర్ లేదా www. jio. com/fiberకు లాగిన్ పొందవచ్చును.
☞ 750కి పైగా టీవీ చానెళ్లను వీక్షించవచ్చును.
☞ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ, హాట్ స్టార్, సన్నెక్స్, సోనీలైవ్, జీ5తో పాటు 14 అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం ఓటీటీ ప్లాట్ఫామ్లోని చానెళ్లు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండాపొందవచ్చును. వినియోగదారులు ఇప్పుడు తమకు ఇష్టమైన షోలు, సినిమాలను ఎలాంటి పరిమితులు లేకుండా వీక్షించవచ్చును.
☞ అపరిమిత డేటాతో కాంప్లిమెంటరీ ఇంటర్నెట్ ప్లాన్, నిరంతరాయంగా స్ట్రీమింగ్, బ్రౌజింగ్ చేసుకోవచ్చును.
☞ అపరిమిత కాల్స్తో కూడిన ఉచిత ల్యాండ్లైన్ వినియోగించుకోవచ్చును.