న్యూఢిల్లీ, డిసెంబర్ 29: గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను 5 కోట్ల కంటే అధిక మంది ఆదాయ పన్ను రిటర్నులు ఇప్పటి వరకు దాఖలు చేసినట్లు ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మరో రెండు రోజుల్లో గడువు ముగియనుండటంతో ఐటీ రిటర్నులు భారీగా పెరిగాయని తెలిపింది. రిటర్నుల గడువును ఐటీ శాఖ గతంలోనే ఐదు నెలలు పెంచింది. దీంతో చివరి రోజు ఈ నెల 31గా నిర్ణయించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను 5.95 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేశారు. మరోవైపు, 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను వెరిఫికేషన్ ఫిబ్రవరి 28, 2022 వరకు సమయం ఇచ్చింది ఐటీ శాఖ.