Income tax | గత ఆర్థిక సంవత్సరం (2020-21) ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించింది. ఈ దఫా తప్పనిసరిగా గడువు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ముందస్తుగా నింపిన రిటర్న్స్ కొత్త ఆదాయం పన్నుశాఖ వెబ్సైట్లో సిద్ధంగా ఉంటాయి. అయితే, ఆ వెబ్సైట్లో వచ్చిన అదనపు ఫీచర్లు, తప్పనిసరి మార్పులను తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ-వెరిఫయింగ్ పూర్తయ్యే లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా, ఒకవేళ మీ ఆదాయం, పన్ను చెల్లింపు వివరాలు సదరు వెబ్సైట్లో కనిపించకపోతే అందుకు కారణాలేమిటో చెక్ చేసుకోవాల్సిందే.
కొత్త ఆదాయం పన్ను వెబ్సైట్లో మీ ఆదాయం, పన్ను చెల్లింపు వివరాలు మీ ఖాతాలో కనిపించకపోవడానికి పలు కారణాలుంటాయి. ఆదాయం పన్ను విభాగంలో పేర్కొన్న కొన్ని డిటైల్స్ను పరిశీలించుకోవాలి. సరిగ్గా పాన్కార్డు వివరాలు సక్రమంగా సమర్పించడంలో విఫలమైనా, పాన్ కార్డ్ డిటైల్స్లో పొరపాట్లు చోటు చేసుకున్నా, టీడీఎస్ లేదా టీసీఎస్ జారీ చేసిన యాజమాన్యాలు లేదా వ్యక్తులు మీ పాన్ డిటైల్స్ తప్పుగా నమోదైనా, టాక్స్ పేమెంట్ చలాన్లలో తప్పులు చోటు చేసుకున్నా.. మీ ఖాతాలో మీ ఆదాయం, పన్ను వివరాలు కనిపించకపోవచ్చు.
పాన్ వివరాలు తప్పుగా నమోదు చేస్తే టీడీఎస్ లేదా టీసీఎస్ వివరాలు సమర్పించాలి. కరెక్ట్ చేసిన పాన్ కార్డు వివరాలు నమోదు చేయాలి. పాన్ కార్డు వివరాల్లో తప్పుగా నమోదు చేసినట్లు సమాచారం కూడా ఇవ్వాలి.
మీ టీడీఎస్ లేదా టీసీఎస్ పత్రాల్లో ఆదాయం పన్ను విభాగం ముందు పాన్ కార్డు డిటైల్స్ సమర్పించకపోతే, సరి చేసిన వివరాలతో కూడిన స్టేట్మెంట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కనుక ఆదాయం పన్ను వెబ్సైట్లో మీ ఖాతాలోకి వెళ్లి, మీ ఆదాయం, మీరు చెల్లించిన పన్ను వివరాలు చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.