న్యూఢిల్లీ, ఆగస్టు 26: గుజరాత్లోని జామ్నగర్ నుంచి హైదరాబాద్కు విమాన సర్వీసులు మొదలయ్యాయి. జామ్నగర్ నుంచి బెంగుళూరు, హైదరాబాద్లకు స్టార్ ఎయిర్ విమాన సర్వీసుల్ని విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రారంభించారు. ఈ నగరాల మధ్య వారానికి మూడు దఫాలు విమానాల్ని నడపనున్నట్లు స్టార్ ఎయిర్ తెలిపింది.