హైదరాబాద్, నవంబర్ 28: హైదరాబాద్కు చెందిన పీట్రాన్..దేశీయ మార్కెట్కు అత్యంత చౌకైన నెక్బాండ్ను పరిచయం చేసింది. రూ.599 విలువైన ఈ నెక్బాండ్ కేవలం అమెజాన్లో మాత్రమే లభించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రత్యేక ధర కొంతకాలమేనని పేర్కొంది.
బ్లూటూత్ కనెక్ట్తో 60 గంటల పాటు ప్లేటైం, మాట్లాడుకునే ఈ నెక్బాండ్ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఇతర ఉత్పత్తుల కంటే తక్కువధరది కావడం విశేషమని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కేవలం పది నిమిషాల చార్జింగ్తో ఏడు గంటలపాటు పనిచేయడం ఈ నెక్బాండ్ ప్రత్యేకత.