న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ.. దేశీయ మార్కెట్కు అత్యంత వేగవంతమైన స్కూటర్ను పరిచయం చేసింది. అంపీర్ ప్రైమస్ పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ ధరను రూ.1.09 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. కేవలం ఐదు సెకన్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ నయా స్కూటర్.. గంటకు 77 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది. రూ. 499 చెల్లించి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.