న్యూఢిల్లీ, నవంబర్ 13: ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన ఫ్లాగ్షిప్ సంస్థ గ్రాసిం ఇండస్ట్రీస్ ఆశాజనక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగా సంస్థ నికర లాభం 13 శాతం ఎగబాకి రూ.1,163.75 కోట్లకు చేరుకున్నది. ఏడాది క్రితం ఇది రూ.1,009 కోట్లుగా ఉన్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.27,485 కోట్ల నుంచి రూ.30,220 కోట్లకు చేరింది.