కొచి:ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్.. వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 56 స్టోర్లను ఏర్పాటు చేయడానికి రూ. 1,600 కోట్ల నిధులను వెచ్చించనున్నట్లు తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేసే స్టోర్లను తెలంగాణతోపాటు తమిళనాడు, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగాల్, యూపీ, ఒడిశా, కేరళలలో నెలకొల్పనున్నట్లు మలబార్ గ్రూపు చైర్మన్ ఎంపీ అహ్మద్ తెలిపారు. ఈ స్టోర్లలో 40 దేశవ్యాప్తంగా, మిగతా 16 విదేశాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో కొత్తగా 1,750 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.