న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: హైదరాబాద్ కేంద్రంగా వినియోగవస్తువుల రిటైల్ చైన్ నిర్వహిస్తున్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్ మార్కెట్లో ప్రవేశించడానికి సిద్ధమయ్యింది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్నేమ్తో రిటైల్ చైన్ నడుపుతున్న ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండి యా తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) కోసం సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవో ద్వారా రూ. 500 కోట్లు సమీకరించాలని కంపెనీ ప్రతిపాదించింది. ఇందులో రూ. 134 కోట్లు మూలధన వ్యయాల కోసం, మరో రూ.200 కోట్లు వర్కింగ్ మూలధనం కోసం వినియోగించాలని, రూ.50 కోట్లు రుణ చెల్లింపుల కోసం నిధులు సమీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది. పవన్కుమార్ బజాజ్, కరణ్ బజాజ్లు నెలకొల్పిన ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా 90కిపైగా స్టోర్స్ను నిర్వహిస్తున్నది.