హైదరాబాద్, అక్టోబర్ 14: ప్రస్తుత పండుగ సీజన్లో ఆర్ఎస్ బ్రదర్స్ ప్రత్యేక ధమాఖాను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని 150 టీవీఎస్ జ్యూపిటర్ బైకులను గెలుచుకునే అవకాశాన్ని ఈసారి కల్పించింది సంస్థ. వచ్చే నెల 19 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద కొనుగోలుదారుడు రూ.500ల విలువ చేసే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీరికి లక్కీ డ్రా కూపన్ ఇవ్వడం జరుగుతున్నదని తెలిపింది.
ఇలా ప్రస్తుత నెలలో మూడుసార్లు(15, 22, 29 తేదీల్లో), నవంబర్ నెలలో మూడుసార్లు(5, 12,19 తేదీల్లో) కస్టమర్ల సమక్షంలోనే, కస్టమర్ల చేతులతోనే డ్రా తీయించడం జరుగుతున్నదని తెలిపింది. ఇలా వారానికి 25 టీవీఎస్ జ్యూపిటర్ బైకులను గెలుచుకోవచ్చునని వెల్లడించింది. దసరా పండుగ కోసం సరికొత్త కలెక్షన్ల పట్టుచీరలు, మెన్స్వేర్, కిడ్స్ వేర్ అతి తక్కువ ధరకే విక్రయిస్తున్నట్టు ప్రకటించింది.