హైదరాబాద్ : తక్కువ సమయంలో ఎక్కువ రాబడి రావాలి డబ్బు కూడా భద్రంగా ఉండాలి అని అందరూ కోరుకుంటారు. అసలు అటువంటి స్కీంస్ ఏమైనా ఉన్నాయా..? ఉంటే డబ్బు సురక్షితంగా ఉంటుందా లేదా ..? డబ్బుసేఫ్టీ తోపాటు రాబడి కూడా కావాలంటే ఈ పథకం పర్ఫెక్ట్.. పోస్టాఫీసు అనేది ఓ ప్రభుత్వ సంస్థ, డబ్బుకి రక్షణ ఉంటుంది. అదే సమయంలో మీ డబ్బు 124 నెలలలో రెట్టింపు అవుతుంది. ఆ పథకం పేరు కిసాన్ వికాస్ పత్ర(కేవీపీ) ప్రస్తుతం 6.9 శాతం వడ్డీ వస్తుంది. దీని ప్రకారం మీ డబ్బు 124 నెలల్లో రెట్టింపు అవుతుంది. బ్యాంకులలోని ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే ఇక్కడే వడ్డీ ఎక్కువగా వస్తోంది.
పోస్ట్ ఆఫీస్ ద్వారా అమలు చేసిన కిసాన్ వికాస్ పత్ర పథకం మీ డబ్బుని సురక్షితంగా ఉంచుతుంది. మెచ్యూరిటీపై రెట్టింపు రాబడిని అందిస్తుంది. కిసాన్ వికాస్ పత్ర పథకం భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇక్కడ మీ డబ్బు ఒక నిర్దిష్ట వ్యవధిలో రెట్టింపు అవుతుంది. కేవీపీ పథకం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్టాఫీసుల్లో ,ప్రధాన బ్యాంకుల్లో అందుబాటులో ఉంది. ముగ్గురు వ్యక్తులు కలిసి ఖాతాను సింగిల్ లేదా జాయింట్ లో తెరిచే అవకాశం ఉంటుంది.
కిసాన్ వికాస్ పత్ర మెచ్యూరిటీ వ్యవధి 124 నెలలు. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 1000. గరిష్ట పరిమితి లేదు. మీకు కావలసినంత డిపాజిట్ చేయవచ్చు. దీని ప్రకారం రిటర్న్స్ కూడా తీసుకోవచ్చు. ఈ పథకం ప్రధానంగా రైతులు, తక్కువ ఆదాయం కలిగిన ప్రజల కోసం రూపొందించారు. తద్వారా వారు దీర్ఘకాలంలో తమ డబ్బును ఆదా చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. 2021 మొదటి త్రైమాసికంలో,కేవీపీకి వడ్డీ రేటు 6.9 శాతంగా నిర్ణయించారు.
మీరు రూ.5 లక్షల పెట్టుబడి పెడితే మెచ్యూరిటీపై రూ.10 లక్షలు పొందవచ్చు. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 1,000. అంతేకాదు కిసాన్ వికాస్ పత్రను సర్టిఫికేట్ రూపంలో పొందుతారు. దీనిలో రూ. 1,000, 2,000, 5,000, 10,000, 50,000 వరకు సర్టిఫికేట్లు ఉంటాయి. ఇందులో మీరు ప్రభుత్వం నుంచి హామీని పొందుతారు. సర్టిఫికేట్ జారీ సమయంలో వడ్డీ రేటు నిర్ణియిస్తారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందులో మార్పులు ఉంటాయి.