న్యూఢిల్లీ, మార్చి 1: దేశీయ ఆటో అమ్మకాలు ఆకట్టుకుంటున్నాయి. గత నెల ఫిబ్రవరిలో 3.35 లక్షలకుపైగా వాహనాల విక్రయాలు జరిగాయి. గత ఏడాది ఫిబ్రవరితో పోల్చితే 11 శాతం పెరిగాయి. మారుతీ ఆల్టో, బాలెనో, డిజైర్, స్విఫ్ట్, వాగనార్ మోడళ్లకు డిమాండ్ కనిపించింది. అలాగే హ్యుందాయ్, టాటా వాహనాలతోపాటు టూవీలర్ సేల్స్ కూడా పెరిగాయి.
అయితే బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ సంస్థలు వాహన రుణాలపై వడ్డీరేట్లను పెంచడంతో కొత్త వాహనాల డిమాండ్పై ఆ ప్రభావం కొంతమేర కనిపిస్తున్నట్టు మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ విభాగం సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. చిప్ కొరత కొన్ని వాహనాల తయారీని ఇంకా వేధిస్తూనే ఉందన్నారు.