న్యూఢిల్లీ, మే 8: డీ-మార్ట్ లాభాల పంట పండింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.413.87 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో వచ్చిన రూ.271.28 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 52.56 శాతం అధికం. అవెన్యూ సూపర్మార్ట్ లిమిటెడ్కు చెందిన డీ-మార్ట్కు గత త్రైమాసికానికిగాను రూ.7,411.68 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.6,255. 93 కోట్ల ఆదాయంతో పోలిస్తే 18.47 శాతం అధికమైంది. సమీక్షకాలంలో నిర్వహణ ఖర్చులు 16.09 శాతం ఎగబాకి రూ.6,916.24 కోట్లకు చేరుకున్నాయి.