న్యూఢిల్లీ, ఆగస్టు 23: చంద్రయాన్-3 జోష్తో సంబంధిత కంపెనీలు ఈ వారంలో రూ.20 వేల కోట్ల సంపదను సృష్టించాయి. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగస్వాములైన ఏడు కంపెనీల షేర్లు బుధవారం కొత్త రికార్డు స్థాయిని చేరుకున్నాయి. ఇంజినీరింగ్ దిగ్గజం ఎల్అండ్టీ, హిందుస్థాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఇందులో ఉన్నాయి. మదుపరులు ఏరోస్పేస్, డిఫెన్స్ షేర్లలో పెట్టుబడులకు గతకొద్ది రోజులుగా పెద్దపీట వేస్తున్నది చూస్తూనే ఉన్నాం. బుధవారం ట్రేడింగ్లోనూ ఇది కొనసాగింది.
దీంతో సెంటమ్ ఎలక్ట్రానిక్స్ షేర్ విలువ గరిష్ఠంగా 14.91 శాతం ఎగబాకింది. పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ షేర్లు 5.47 శాతం, ఎంటార్ టెక్నాలజీస్ షేర్లు 4.84 శాతం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షేర్లు 3.57 శాతం చొప్పున ఎగిశాయి. భారత్ ఫోర్జ్ షేర్లు 2.82 శాతం, అస్త్ర మైక్రోవేవ్ ప్రోడక్ట్స్ షేర్లు 1.72 శాతం, ఎల్అండ్టీ షేర్లు 1.42 శాతం పెరిగాయి. ఇన్వె స్టర్ల కొనుగోళ్లతో చాలా కంపెనీల షేర్లు 52 వారాల గరిష్ఠాన్ని తాకడం విశేషంగా చెప్పుకోవచ్చు.