హైదరాబాద్, జూలై 4: దేశంలో అతిపెద్ద ఆసుపత్రుల నిర్వహణ సంస్థల్లో ఒకటైన హైదరాబాద్కు చెందిన కేర్ హాస్పిటల్స్ గ్రూపు తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టింది. ఇందుకోసం ఇండోర్కు చెందిన సీహెచ్ఎల్ హాస్పిటల్స్ను కొనుగోలు చేసింది. ఒప్పందం విలువ రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల స్థాయిలో ఉంటుందని కేర్ వర్గాలు వెల్లడించాయి. మధ్యభారతంలో కార్డియాలజీ/కార్డియక్ సర్జరీ, న్యూరో సైన్స్, జీఐ, కాలేయ మార్పిడి, రెనాల్ సైన్స్, క్రిటికల్ కేర్ సేవలు అందిస్తున్నది.
కేర్ గ్రూపులోకి సీహెచ్ఎల్ హాస్పిటల్స్కు స్వాగతం పలుకుతున్నట్లు, మధ్యభారతంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో వైద్య సేవలను మరింత విస్తృత పరుచాలనే ఉద్దేశ్యంతో సీహెచ్ఎల్ హాస్పిటల్ను కొనుగోలు చేసినట్లు కేర్ హాస్పిటల్స్ గ్రూపు సీఈవో జస్దీప్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా సీహెచ్ఎల్ హాస్పిటల్స్ సీఎండీ రాజేశ్ భార్గవ మాట్లాడుతూ..ఇండోర్లో అతిపెద్ద దవాఖానాల్లో ఒకటైన సీహెచ్ఎల్ హాస్పిటల్స్ను కేర్ కొనుగోలు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు, గడిచిన 21 ఏండ్లుగా వైద్య రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు.