న్యూఢిల్లీ : భారత్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతుండటంతో ఓలా వంటి సంస్ధలు ఈవీ మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. తాజాగా బెంగళూర్కు చెందిన లాస్ట్ మైల్ కనెక్టివిటీ స్టార్టప్ బౌన్స్ పేరుతో దేశీ ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ కంపెనీ భారత్లో రూ 79,999 (ఎక్స్ షోరూం) ధరతో బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంఛ్ చేసింది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఈవీ సబ్సిడీలు ఆఫర్ చేస్తుండటంతో ఈ స్కూటర్ రూ 59,999కు లభిస్తుంది. బౌన్స్ ఇప్పటికే ఇన్ఫినిటీ బౌన్స్ బుకింగ్స్ను రూ 499 టోకెన్ అమౌంట్తో ప్రారంభించగా ఈ స్కూటర్ డెలివరీలు వచ్చే ఏడాది మార్చ్ 2022 నుంచి ప్రారంభమవుతాయి. బౌన్స్ ఇన్ఫినిటీ స్కూటర్ రెడ్, వైట్, బ్లాక్, గ్రే, సిల్వర్ రంగుల్లో లభిస్తుంది.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్పోన్ కనెక్టవివిటీ, స్మార్ట్పోన్ అప్లికేషన్తో పాటు ఈ స్కూటర్ రివర్సింగ్ మోడ్, డ్రాగ్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్, ఈకో మోడ్, పవర్ మోడ్లను కలిగిఉంటుంది. బౌన్స్ ఇన్ఫినిటీ ఈకో మోడ్లో చార్జి చేసిన తర్వాత 85 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. స్వాపింగ్ ఫీచర్ ద్వారా కస్టమర్లు కన్వెన్షల్ సాకెట్ను ఉపయోగించి బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు.