న్యూఢిల్లీ, ఆగస్టు 21 : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..తొలిసారి లగ్జరీ కార్లను కొనుగోలుచేసేవారిని దృష్టిలో పెట్టుకొని నయా మాడల్ను పరిచయం చేసింది. ఎక్స్1 పేరుతో విడుదల చేసిన ఈ కారు ధరను రూ.49.9 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
ప్రస్తుత సంవత్సరంలో 25 కొత్త మాడళ్లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 13 మాడళ్లను తీసుకువచ్చినట్టు బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్, సీఈవో హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 9 వేలకు పైగా కార్లను విక్రయించినట్టు, గతేడాదితో పోలిస్తే 17 శాతం అధికమని, అలాగే ఈవీల విక్రయాల్లో 78 శాతం వృద్ధిని సాధించినట్టు చెప్పారు. ఈ మాడల్తోపాటు సంస్థ ఐ5 మాడల్ను కూడా ప్రదర్శించింది.