ముంబై, ఆగస్టు 24: బజాజ్ ఆటో.. దేశీయ మార్కెట్కు నయా పల్సర్ బైకులను పరిచయం చేసింది. వీటిలో రూ.92,900 ధర కలిగిన పల్సర్ 125, రూ.1.15 లక్షల విలువైన పల్సర్ 150ను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ రాకేశ్ శర్మ మాట్లాడుతూ..వచ్చే పండుగ సీజన్పై ఆశావాదంగా ఉన్నట్టు, ప్రధానంగా ఈ నూతన బైకులు కొనుగోలుదారులను ఆకట్టుకునే అవకాశాలున్నాయన్నారు.
పాత బైకులతో పోలిస్తే ఈ నయా బైకులను నూతన ఫీచర్లు, టెక్నాలజీ పరంగా మార్పులు చేసినట్టు చెప్పారు. వచ్చే పండుగ సీజన్లో మూడు కొత్త బైకులు, నూతన బ్రాండ్ను పరిచయం చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. గత త్రైమాసికంలో వాహన ధరలను పెంచినప్పటికీ డిమాండ్ మాత్రం పడిపోలేదని, వచ్చే త్రైమాసికాల్లో పెరిగే అవకాశం ఉందన్నారు.