న్యూఢిల్లీ, అక్టోబర్ 18: యాక్సిస్ బ్యాంక్ కూడా వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని పావు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన అన్ని రకాల రుణాలపై వడ్డీరేటు మరింత పెరగనున్నది.
దీంతో ఒక్కరోజు నుంచి మూడేండ్ల లోపు కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ 8.15 శాతం నుంచి 8.50 శాతం శ్రేణికి చేరుకున్నది. ఇప్పటికే ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్లు తమ రేట్లను అర శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే.