న్యూఢిల్లీ, జూన్ 7: ఈ ఏడాది ఆఫీస్ స్పేస్కు డిమాండ్ జోరుగా పెరుగుతుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ వేక్ఫీల్డ్ తెలిపింది. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా రికవరీ అవుతున్న నేపథ్యంలో ఐటీ/ఐటీఈఎస్ రంగం, సార్టప్లు పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనున్న కారణంగా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్కు డిమాండ్ 2022లో 14 శాతం వృద్ధిచెంది 60 మిలియన్ల చదరపు అడుగులకు చేరుతుందని కన్సల్టెన్సీ అంచనా వేసింది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, చెన్నై, కోల్కతా, పుణె, అహ్మదాబాద్-ఈ ఎనిమిది నగరాల్లో 2021లో 52.57 మిలియన్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ జరిగిందని, ఈ ఏడాది అది మరింత జోరుగా పెరుగుతుందన్నది.
వచ్చే రెండేండ్లలో ఈ లీజింగ్ దాదాపు 60 మిలియన్ చదరపు అడుగుల మేర ఉంటుందని అంచనా వేస్తున్నట్టు కుష్మన్ వేక్ఫీల్డ్ ఇండియా ఎండీ బాదల్ యాగ్నిక్ చెప్పారు. 2022-2026 మధ్యకాలంలో దేశంలో స్టార్టప్లు 25-30 లక్షల మందిని నియమించుకుంటాయని కన్సల్టెన్సీ సంస్థ అంచనా వేస్తున్నది. అలాగే ఆఫీసుల్ని విశాలమైన ప్రాంగణాల్లోకి విస్తరించాలని కంపెనీలు యోచిస్తున్నందున కూడా ఈ స్పేస్కు 25-30 శాతం అదనపు డిమాండ్ ఏర్పడుతున్నదని అంచనా వేసింది.
డిమాండ్కు కారణాలివి..
కొవిడ్ పాండమిక్ తర్వాత ఆర్థిక వ్యవస్థ రికవరీ
ఐటీ-బీపీఎం రంగంలో పెరిగిన హైరింగ్ కార్యకలాపాలు
ఫ్యూచర్ వర్క్ స్పేస్పై నవ రూపకల్పనలు
చురుకైన స్టార్టప్ ఎకోసిస్టం
వాణిజ్య రియల్ ఎస్టేట్ సంస్థాగతం కావడం