అమరావతి : ఓ యువతి బ్రేక్ బదులు యాక్సిలేటర్ తొక్కడంతో ముగ్గరు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ఏపీలోని తెనాలిలో చోటు చేసుకుంది. రవాణా శాఖ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్, రెన్యువల్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తెనాలి మార్కెట్ యార్డు పరిధిలో ఆర్టీఏ అధికారులు ఎప్పటి లాగే డ్రైవింగ్ టెస్టులు నిర్వహించారు.
ఈ క్రమంలో తెనాలి పట్టణానికి చెందిన ఇద్దరు యువతులు లైసెన్స్ కోసం వచ్చారు. ఓ యువతి కారు సరిగానే నడిపి కారులో కూర్చుంది. రెండో యువతి కారును స్టార్ట్ చేసి కొంత ముందుకు వెళ్లిన తర్వాత బ్రేక్ బదులు యాక్సిలేటర్ తొక్కింది. దీంతో కారు ఒక్కసారిగా పక్కనే ఉన్న ప్రజలు, వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వృద్ధులు, ఓ మహిళ గాయపడింది. క్షతగాత్రులను వెంటనే దవాఖానక తరలించారు.