వైజాగ్,4 మే: వేదాంత వీజీసీబీకి అరుదైన గౌరవం దక్కింది. న్యూఢిల్లీలో జరిగిన అపెక్స్ ఇండియా హెల్త్ అండ్ సేఫ్టీ కాన్ఫరెన్స్ 2020 లో వేదాంత వీజీసీబీకు గోల్డ్ అవార్డువచ్చింది. వీజీసీబీకి పోర్ట్ సర్వీస్ రంగంలో ‘సేఫ్వర్క్ప్లేస్ మేనేజ్మెంట్’ విభాగంలో ఈ అవార్డును అందజేశారు.
అపెక్స్ ఇండియా ఫౌండేషన్ నియమించిన స్వతంత్య్ర నిష్ణాతుల బృందం తమ ప్రమాణాలకు అనుగుణంగా పరిశీలించి, తనిఖీలు చేసిన తరువాత ఈ అవార్డుకు వీజీసీబీని ఎంపిక చేశారు. కంపెనీ తరపున ఈ అవార్డును అపెక్స్ ఇండియా ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, అతిథుల చేతుల మీదుగా వీజీసీబీ హెడ్ హెచ్ఎస్ఈ ప్రసన్నకుమార్ అందుకున్నారు.