తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమల(Tirumala)కు భక్తులు పెద్దసంఖ్యలో చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలగిరులు కిటకిటలాడుతున్నాయి. నిన్న స్వామివారిని 71, 690 మంది భక్తులు దర్శించుకోగా 24,993 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) రూ.3.87 కోట్లు వచ్చిందని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు.
ఆదివారం స్వామివారి దర్శనం కోసం 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 8 గంటల్లో సర్వదర్శనం(Sarvadaran) కలుగుతుందని వివరించారు. దీపావళి పండుగ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆదివారం దీపావళి ఆస్థానం నిర్వహిస్తుండడం వల్ల బ్రేక్దర్శనాలు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆస్థానం కారణంగా కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవలను రద్దు చేసి, అర్చన, తోమాల సేవలను ఏకాంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.