తిరుమల : తిరుమలలో టీటీడీ సిబ్బందిపై ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక దర్శనం టికెట్ల వ్యవహారంలో ఉత్తర ప్రదేశ్కు చెందిన సినీనటి అర్చన గౌతమ్ ఆరోపణలు చేయడం సంచలనం కలిగిస్తోంది. పవిత్ర తిరుమలలో దర్శనం కోసం రాగా దురుసుగా ప్రవర్తించారని ట్విట్టర్ వేదికగా మండిపడింది. వీఐపీ దర్శనం కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 10,500 వసూలు చేస్తున్నారని ఆరోపించింది.
దర్శనం కోసం టికెట్ను కొనుగోలు కోసం కౌంటర్ వద్దకు వెళ్తే సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని, తనపై దాడికి యత్నించారని ఆమె ఈ మేరకు ట్విట్టర్లో సెల్ఫీ వీడియో పోస్టు చేసింది. టీటీడీ దోపిడికి అడ్డగా మారిందని, మహిళా అని చూడకుండా తనపట్ల దురుసుగా ప్రవర్తించిన సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి డిమాండ్ చేసింది.
ఇటీవల ఏపీకి చెందిన టీడీపీ నాయకుడు టెక్ రవి సైతం తనకు తిరుమలలో చోటు చేసుకున్న అనుభవం పై ఆరోపణలు చేయగా అతడిపై టీటీడీ కేసు నమోదు చేసింది . గత 16 సంవత్సరాల క్రితం సేలంకు చెంది న భక్తుడు మేల్ఛాట్ వస్త్రసేవా టికెట్ను కొనుగోలు చేశాడు. అయితే అప్పటి నుంచి వస్త్రసేవకు అవకాశం కల్పించలేదని ఆరోపిస్తూ సేలంలో వినియోగదారుల ఫోరంలో కేసు వేశాడు. కేసును పరిశీలించిన కోర్టు వస్త్రసేవ కల్పించాలని లేకపోతే రూ. 50లక్షలు భక్తుడికి ఇవ్వాలని టీటీడీకి ఆదేశించింది. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో టీటీడీ బోర్డుపై సేలం భక్తుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.
भारत के हिंदू धर्म स्थल लूट का अड्डा बन चुके हैं धर्म के नाम पर तिरुपति बालाजी मैं महिलाओं के साथ अभद्रता करते,यह टीटीडी के कर्मचारी पर कार्यवाही होनी चाहिए । मैं आंध्र गवर्नमेंट से निवेदन करती हूं।ओर यह VIP दर्शन के नाम पर 10500 एक आदमी से लेते है । इसे लूटना बंद करो । @INCIndia pic.twitter.com/zABFlUi0yL
— Archana Gautam (@archanagautamm) September 5, 2022