అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా పెన్నా నదిలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకులు సంగం మండలం పెరమన జంగాలదరువుకు చెందిన డి. భవానీ, శ్యామ్ప్రసాద్, చరణ్గా గుర్తించారు. సమాచారమందుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ కుమారుల గల్లంతుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతోగాలింపు చర్యలు చేపట్టారు.