అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ యువకుడు నాటు తుపాకీతో హల్చల్ చేశాడు. జిల్లాలోని పాచిపెంట మండలం తుమరవల్లి గ్రామానికి చెందిన చంద్రరావు అనే వ్యక్తి తన వద్ద ఉన్న నాటుతుపాకీతో పదేళ్ల బాలుడిపై కాల్పులు జరిపాడు. కాగితపు బంతులతో తయారు చేసిన గుండుతో కాల్చడంతో అజిత్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసు కున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.