అమరావతి : విజయవాడలో నిన్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బాలిక సంఘటనపై నిందితుడు, టీడీపీ నాయకుడు వినోద్ జైన్ ను పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్నిరోజులుగా తనను వేధిస్తుండడంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బాలిక సుసైడ్ నోట్లో రాసింది. సుసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెస్ట్జోన్ ఏసీపీ వెల్లడించారు. గత 2 నెలలుగా బాలికను వేధిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు.
గత ఎన్నికల్లోటీడీపీ కార్పొరేటరుగా పోటీ చేసి ఓడిపోయిన వినోద్ బాలికపై అనైతిక చర్యలకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ అధిష్టానం అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది .