అమరావతి : సుదీర్ఘంగా కొనసాగుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద(YS Viveka) హత్య కేసుపై సుప్రీం కోర్టు(Supreme court) సీబీఐ(CBI)కి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30లోపు వివేకా హత్యకేసు దర్యాప్తు ముగించాలని ఆదేశించింది. విస్తృత కుట్ర కోణాన్ని అత్యంత వేగంగా బయటపెట్టాలని సూచించింది. గతంలో ఇదే కోర్టు వేగంగా దర్యాప్తు చేపట్టాలని మరోసారి ఆదేశించింది.
హత్య కేసులో నిందితుల్లో ఏ5 నిందితుడైన శివ శంకర్రెడ్డి భార్య తులసమ్మ సుప్రీంను ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం కోర్టులో కేసు విచారణకు రాగా ధర్మాసనం వైఎస్ వివేకా హత్య కేసుపై తీవ్రంగా స్పందించింది. ఏప్రిల్ 15లోగా దర్యాప్తును పూర్తి చేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. సీబీఐ దాఖలు చేసిన నివేదికను పరిగణలోకి తీసుకున్నట్లు కోర్టు వెల్లడించింది . కొత్త సిట్ను ఏర్పాటు చేస్తూ సీబీఐ ప్రతిపాదించగా కొత్త అధికారి నియమకం వల్ల విచారణ ఆలస్యమవుతున్నందును శివశంకర్రెడ్డికి బెయిల్ ఇవ్వాలని తులసమ్మ విజ్ఞప్తి చేయగా ధర్మాసనం తిరస్కరించింది.