Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Salakatla Brahmotsavam) కన్నులపండువగా జరుగుతున్నాయి. ఆరో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి హనుమంత వాహనంపై (Hanumantha Vahanam) తిరువాడ వీధుల్లో తిరుగుతూ భక్తులకు అభయం ఇచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన హనుమంత వాహన సేవ 10 గంటలకు ముగియనుంది. వాహన సేవల్లో భాగంగా సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథంపై శ్రీవారు ఉరేగనున్నారు. మహిళా భక్తులే ఈ రథాన్ని లాగనున్నారు. ఇక రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గజ వాహన సేవ నిర్వహించనున్నారు.