అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం తొలి ఆరు నెలల్లోనే రూ.40వేల కోట్లు అప్పులు చేసిందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆరోపించారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా ఆర్థిక లోటు భారీగా పెరిగిందని అన్నారు. అప్పులు, ఆర్థిక లోటులో ఏపీ నంబర్ వన్గా నిలవడం శోచనీయమని దుయ్యబట్టారు. జగన్ అవినీతి కారణంగానే భారీగా అప్పులు పెరిగిపోతుండడంతో ఆర్థిక లోటు ఏర్పడుతుందని ఆరోపించారు.
వివిధ రాష్ట్రాల్లోని సంస్థలకు బకాయిలు చెల్లించనందుకు ఏపీకి రెడ్ నోటీసులు జారీ చేయడం జగన్ సిగ్గుతో తలదించుకోవాలని పేర్కొన్నారు. ఏపీకీ వైద్య పరికరాల ఉత్పత్తి చేసిన వారికి కోట్ల రూపాయలు బకాయి పెట్టినందుకు రాష్ట్రానికి రెడ్ నోటీసులు జారీ చేయడం జగన్ పాలన దౌర్భాగ్యాన్ని తెలియజేస్తుందని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అనురాధ విమర్శించారు.