అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి విదేశీ విమాన సర్వీసులు బుధవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. దుబాయ్కి చెందిన విమానం 65 మంది ప్రయాణికులతో ఈ సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో గత నెల 3 నుంచి ఇక్కడి విమానాశ్రయానికి విదేశీ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తూ పౌర విమానయానశాఖ నిర్ణయం తీసుకుంది. వందేభారత్ మిషన్లో భాగంగా తిరిగి ఇవాళ్టి నుంచి విమాన సర్వీసులను ప్రారంభించారు. దుబాయ్ నుంచి విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు అధికారులు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.