Pawan Kalyan | 2024లో రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమయ్యారు. అయితే, పర్యటన కోసం ప్రత్యేకంగా బస్సు సిద్ధమైంది. బస్కు సంబంధించిన వీడియోను పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. వారాహి.. రెడీ ఫర్ బ్యాటిల్’ ట్యాగ్లైన్తో వీడియోను పోస్ట్ చేయగా.. ట్విట్టర్లో వైరల్గా మారింది.
వాహనం, ట్రయల్ రన్ను హైదరాబాద్లో బుధవారం పవన్ కల్యాణ్ పరిశీలించారు. వాహనానికి ‘వారాహి’ అమ్మవారి అని పేరుపెట్టారు. దుర్గాదేవి సప్తమాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. వారాహి అమ్మవారు అన్ని దిక్కులను కాచే అమ్మగా పురాణాలు చెబుతున్నాయి. సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించే లక్ష్యంతో జనసేనానికి రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు.