Pawan Kalyan | గ్రామీణులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా నవరత్నం అనే పేరుతో కొందరికి ఉంగరం తొడిగితే అభివృద్ధి కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన విశాఖపట్నంలో జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ 152 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే సంక్షేమం పేరిట అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తారా? అని ఏపీ సీఎం వైఎస్ జగన్ను ప్రశ్నించారు.
ప్రజలు ఎన్నుకున్నదని మీరంతా పని చేయడానికని, కానీ 152 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే పని చేయకుండా ఉండటానికి కాదని అన్నారు. గుంతలతో నిండిపోయిన రోడ్లతో గ్రామాలు, కంపెనీలు, ఆఫీసులు లేని ఊళ్లు, ఉద్యోగాల్లేని పట్టణాల్లో కొందరికి నవరత్న ఉంగరాలు తొడిగితే కష్టాలు తొలగిపోతాయి.. మీకు డబ్బులు వస్తాయంటే ఆకలి తీరిపోతుందా? అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.