అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,506 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1,835 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 16 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 19,93,697కు పెరిగాయి. ఇవాళ్టి వరకు మొత్తం 19,62,185 మంది కోలుకున్నారు. ఇంకా 17,865 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,647కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 65,500 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.